19, నవంబర్ 2018, సోమవారం

శ్రీశైల దర్శనం

   
కాశీ మూడుసార్లు వెళ్లాను కానీ,శ్రీశైలం వెళ్ళాలన్న కోరిక  ఇన్నాళ్లకు తీరింది. చాలాకాలం నుంచి వెళ్లాలన్న శ్రీశైలం యాత్ర ఈ ఏడాది కార్తిక మాస ఆరంభంలో  వెళ్లే అదృష్టం దక్కింది. మల్లన్న, భ్రమరాంబ దర్శన భాగ్యం కలిగింది. ప్రతియేటా ఆర్టీసీ పంచారామాలు, శ్రీశైలం తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ఆరేడుసార్లు ఆర్టీసీ సౌజన్యంతో పంచారామాలు వెళ్లి వచ్చాను. అయితే ఈసారి శ్రీశైలం వెళ్లాలని అనుకోవడం ఆర్ ఎం రవికుమార్ ప్రెస్ మీట్ సందర్బంగా ప్రస్తావించడంతో డిపో మేనేజర్ శ్రీ పెద్దిరాజు సరేనన్నారు. శ్రీశైలానికి ప్రతిరోజూ స్పెషల్ బస్సు నడుపుతామని చెప్పడంతో రద్దీ సమయంలో కాకుండా వెళ్లాలని దీపావళి తర్వాత రోజు రాత్రి వెళ్లాలని నిర్ణయించుకుని టికెట్స్ అడిగితే,రాత్రి 8న్నర రెగ్యులర్ బస్సుకు  నాలుగు టికెట్స్ బ్లాక్ చేసారు. అయితే  చివరి వరకూ టెన్షన్ గానే సాగింది యాత్ర.
  శ్రీశైలం వెళుతున్న సంగతి జాంపేట బ్యాంకు చైర్మన్ శ్రీ బొమ్మన రాజకుమార్ గారికి బ్యాంకు లో ఉండగా చెప్పాను. ఆయన శ్రీశైలంలోని  శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాంగ సత్రానికి ఫోన్ చేసి, రాజమండ్రి నుంచి రేపు ఉదయం నలుగురు వస్తున్నారని రూమ్,భోజనం అన్నీ ఏర్పాటు చేయాలని, డబ్బులు తీసుకోవద్దని భాస్కరరావు అనే వ్యక్తికి  చెప్పేసారు. ఇక అందరికీ అక్రిడేషన్స్ ఉండవని,అందుకే  అక్రిడేషన్ తో సంబంధం లేకుండా తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరడంతో అలాగే అని డిఎమ్ చెప్పారు. నవంబర్ 8గురువారం రాత్రి 8న్నర బస్ కి బయలుదేరాలని నిర్ణయించడంతో సమాచారం సత్యనారాయణ,కళ్యాణ్ గ్రాఫిక్స్ డిటిపి శ్రీనివాస్,కేకే యాడ్స్ జేజిరావు లకు రెడీ అవ్వమని  చెప్పేసారు. అయితే సాయంత్రం 5గంటల ప్రాంతానికి సత్యనారాయణ గారు తనకు రావడం కుదరదని చెప్పడంతో ఎవర్ని తీసుకెళ్లాలా అని ఆలోచనలో  పడ్డాను. మొత్తానికి 7.30 ప్రాంతంలో ఫోన్ చేస్తే, సత్యనారాయణ గారు వస్తున్నట్టు చెప్పారు. డిపోకు వెళ్ళాక సర్వీస్ నెంబర్ 2809బస్సు ఫ్లాట్ ఫారం మీద చూసి ఎక్కడానికి  వెళ్తే,టికెట్ తీయాలని  డ్రైవర్ చెప్పాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సెక్షన్ అధికారి అలాగే అన్నాడు. ఈలోగా డిపో మేనేజర్ కి ఫోన్ చేయడంతో తీసుకెళ్లమని,స్క్వాడ్ వస్తే తనకు ఫోన్ చేయమని సూచించడంతో, డ్రైవర్  మమ్మల్ని బస్సు ఎక్కమన్నాడు. హమ్మయ్య అంటూ ఎక్కాం.











  9వ తేదీ శుక్రవారం  ఉదయం 9గంటల ప్రాంతానికి దిగాం. కొండమీద బస్టాప్ లో దిగాక రిటర్న్ అదే బస్సులో రావడానికి టికెట్స్ బ్లాక్ చేయమని అడిగితే, ఏ ఎస్ ఎం కి ఫోన్ చేయమన్నారు. చేశాను. ఆయన కర్నూల్ డిపోకు చేయమన్నారు. చేశాను. కానీ రాజమండ్రి డిపో మేనేజర్ చెప్పాలని అనడంతో డిఎమ్ శ్రీ పెద్దిరాజు గారికి ఫోన్ చేశాను. విషయం చెప్పేసరికి నేను చేయిస్తానని అన్నారు. దాంతో ముందుగానే సత్రం రిజర్వ్ కావడంతో నడుచుకుంటూ దగ్గరలోని దేవాంగ సత్రానికి వెళ్ళాం. అక్కడ ఏసీ రూమ్ ఇవ్వడంతో ఫ్రెష్ అప్ అయ్యాం. మల్లికార్జునుడు, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి బయలుదేరాం. జనం రద్దీ చూసి, 150రూపాయల టికెట్ తీసుకుని దర్శనం పూరీచేశాం. ప్రసాదాలు కొన్నాం.
  అక్కడ నుంచి రూమ్ కి వచ్చేసాం. భోజనాలు పూర్తయ్యాక ఒంటిగంటకు ఆటోలో సైట్ సీయింగ్ కి బయలు దేరాం. మనిషికి 75చొప్పున ఇమ్మంటే సరేనన్నాం. సాక్షి గణపతి,హఠకేశ్వరం,పాలధార - పంచధార, శిఖర దర్శనం ఇలా ఐదు ప్రదేశాలు పూర్తిచేసుకుని,3గంటలకల్లా రూమ్ కి వచ్చేసాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయి,డిపోకు బయలు దేరాం. అప్పటికే డిపో మేనేజర్ శ్రీ పెద్దిరాజు గారు ఫోన్ చేసి టికెట్స్ చేయించానని వెళ్లి చూసుకోమని చెప్పడంతో, డిపోలోపల కౌంటర్ దగ్గరకు వెళ్లి అడిగితె రిజర్వ్ అయ్యాయని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాం. సాయంత్రం 4న్నర గంటలకు కరెక్ట్ గా 2810సర్వీస్ నెంబర్  బస్సు బయలుదేరింది. దారిలో టిఫిన్ కింద దోశలు తినేసాం. ఉదయం 5గంటలకల్లా రాజమండ్రి డిపోలో దిగాం.అదే బస్సులో వెళ్లి అదే బస్సులో తిరిగి వచ్చాం. సత్యనారాయణ గారి బైక్ మీద నన్ను ఇంటికి డ్రాప్ చేసారు. అలా శ్రీశైలం దర్శనం మొత్తానికి పూర్తిచేశాను. అయితే ఒకరోజు కాకుండా మూడు నాలుగు రోజులు ఉండి పోయేలా వెళ్లి,అక్కడ శ్రీశైలం డ్యామ్,మ్యూజియం,పరిసర ప్రాంతాలు చూసి వస్తే బాగుంటుందని పించింది. అయితే  మళ్ళీ శ్రీశైల దర్శనం అవుతోందో లేదో చూడాలి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి